బంగారం 10 గ్రాముల ధర రూ.535 క్షీణించి రూ. 28,980 వద్ద ట్రేడవుతోంది. వెండి కూడా కేజీకి రూ.534 నష్టంతో రూ.36.983 వద్ద ట్రేడవుతోంది. ఇదే ధోరణి కొనసాగితే… మంగళవారం స్పాట్ మార్కెట్లో పసిడి ధర భారీగా తగ్గే అవకాశం ఉంది. కాగా సోమవారం ముంబై స్పాట్ మార్కెట్లో సైతం పసిడి 99.9 ప్యూరిటీ 10 గ్రాముల ధర రూ. 445 తగ్గి రూ.28,650కి చేరింది. 99.5 ప్యూరిటీ ధర కూడా ఇదే స్థాయిలో తగ్గి రూ.28,500కు చేరింది. వెండి కేజీ ధర రూ.655 తగ్గి రూ.37,035కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్ లో పసిడి బలహీన ధోరణి, దేశీయంగా కొనుగోళ్ల మద్దతు తగ్గడం వంటి కారణాలతో పసిడి సోమవారం బంగారం ధర తగ్గింది.
బంగారం తగ్గింది!
